
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల డయేరియా వ్యాధి విజృంభించింది. గ్రామంలో తాగునీటి పైపులు, డ్రైనేజీ వ్యవస్థలో లీకేజీ కారణం చేత కలుషితమయ్యాయి. ఈ కలుషిత నీరు వల్ల డయేరియా వ్యాధి వ్యాపించింది. దీనివల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి.
డయేరియా కేసులు ఈనెల 13న ప్రారంభమయ్యి కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దీనివల్ల 53 మంది చికిత్స పొందుతూ ఉన్నారు.ప్రభుత్వం చర్యలు తీసుకొని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తుంది. ప్రజలకు సురక్షితమైన నీరు కోసం టాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డయేరియా ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. డయేరియా వలన మరణించిన బాధితుల కుటుంబాలను కలుసుకున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తపరిచారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.అక్కడ ఉన్న పరిస్థితులను కూడా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని, ఈ ఘటనలో మరణించిన కుటుంబాల వారికి అన్ని విధాలుగా సహాయపడతాము, పిల్లల విద్యకు కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అని హామీ ఇచ్చారు.