ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ పై అధికంగా పడే అవకాశం ఉంది.

భారీ వర్షాలు, ఈదురుగాలులు:
ఈనెల 14 నుండి 17 వరకు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా.
మత్స్యకారులకు హెచ్చరికలు:
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
ప్రభుత్వ చర్యలు:
భారీ వర్ష సూచన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, SDRF సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800-425-0101 అందుబాటులో ఉంచారు.
అప్రమత్తత అవసరం:
ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తుఫాను ప్రభావం నుండి రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.