పల్లె పండుగ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ లో పల్లె పండుగ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృష్ణాజిల్లా కంకిపాడు లో ప్రారంభించారు.

ఈ పల్లె పండుగ వారోత్సవాలను గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాలు అక్టోబర్ 14 నుండి 20 వరకు జరగనున్నాయి.గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం మరియు గ్రామీణ ప్రాంత అభివృద్ధికి సహాయపడడం ఈ పల్లె వారోత్సవాలు ముఖ్య ఉద్దేశ్యం. ఈ వారోత్సవాలలో మొత్తం 13,324 గ్రామాలు పాల్గొంటున్నాయి.

ఈ వారోత్సవాలు ముఖ్య కార్యక్రమాలు:

రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మత్తు.4500 కోట్లతో మూడు వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు మరియు 500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం.

పాఠశాలలలో రూఫ్ టాప్స్ నిర్మాణం.

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నీటి సమస్య పరిష్కారం.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ పథకం కింద వ్యవసాయ కుంటలు, చెక్ డ్యాము్ లు, గోకులాలు నిర్మిస్తారు.గ్రామ సభలు నిర్వహించి వివిధ అభివృద్ధి పనులను చర్చించి ఆమోదం తెలుపుతారు.

ప్రభుత్వ పథకాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి