
ప్రభాస్ ప్రస్తుతం రెండు కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం, మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా.ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు నెలకొల్పగా, ఇది పోలీస్ డ్రామా కథాంశంగా తెరకెక్కుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్త లుక్తో అభిమానులను అలరించబోతున్నారు.
స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ చివరలో మొదలుకానుందని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోందని నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. ‘భూల్ భూలయ్యా 3’ ప్రమోషన్ ఇంటర్వ్యూలో స్పిరిట్ సినిమా గురించిన తాజా అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ చివర్లో షూటింగ్ ప్రారంభం కానుండగా, ఆరు నెలల తర్వాత సందీప్ వంగా ‘యానిమల్ పార్క్’ అనే మరో ప్రాజెక్టును కూడా మొదలుపెడతారని భూషణ్ కుమార్ వెల్లడించారు.
దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ ‘స్పిరిట్’ సినిమా మొదటి రోజే 150 కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తుందని. ప్రభాస్ నటన, పాత్ర చిత్రణ సినిమాకు ప్రధాన బలం అవుతుందని చెప్పారు. ప్రభాస్లో ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తిస్తునామని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు.
ప్రభాస్ ఇప్పటికే ‘సలార్’, ‘కల్కి’ సినిమాల విజయాలతో మంచి జోష్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో స్పిరిట్ సినిమాపై కూడా అంచనాలు మరింత పెరుగుతున్నాయి.