
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టిన ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మండలాల యూనిట్లుగా డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ 2019-24 మధ్య పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేసిన విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, 49.8 కోట్లు పెయింట్లు, 59.72 కోట్లు రీ పెయింటింగ్ కోసం ఖర్చయ్యాయనీ, గ్రామీణ గిరిజన విలక్షణ రంగులు టెర్రాకోట్లో వేసినట్లు తెలిపారు. “4800 కోట్లు రంగులకేనా?” అని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
తన వ్యాఖ్యలు చర్చకు తీసుకురావడంతో పాటు, త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానాన్ని ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకుని, 101 గ్రామ పంచాయతీల్లో చెత్త ద్వారా రూ.2600 కోట్లు ఆదాయం సమకూర్చడమే కాక, రెండు లక్షల 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.
“చెత్తతో సంపద వస్తుందని, దాన్ని కార్మికులకు కేటాయిస్తామని” పవన్ కల్యాణ్ వెల్లడించారు. పంచాయతీ నిధుల సమీకరణలో ఎదురవుతున్న సవాళ్లను స్వీకరించి, ముందుకు సాగుతామని చెప్పారు. ఈ సందర్భంగా, పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు, ఆర్థిక నిధుల రికవరీ కోసం చర్యలు తీసుకుంటామని, సమీక్షలలో ఎదురైన ఇబ్బందుల కారణంగా ఉన్న ఐఏఎస్ అధికారిపై కూడా పలు విమర్శలు గుప్పించారు.