సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి: ఏపీ సీఎం చంద్రబాబుపై ముద్రగడ ఫైర్

చాలా రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన లేఖ అస్త్రాలు మళ్లీ మొదలెత్తారు, ఈరోజు ముఖ్యమంత్రికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాస్తూ, ‘‘ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా?’’ అని ప్రశ్నించారు ఏపీలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తలేరు హామీల పరంగా తీసుకున్న చర్యలపై ముద్రగడ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘‘సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి’’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయం అని అన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముద్రగడ తెలిపారు.

సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ‘దొంగ సూపర్ సిక్స్ హామీలు తలచుకుంటే భయమేస్తుంది’ అన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి పనిచేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక అమాయకులు మీద సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు ఈ లేఖ ద్వారా, ముద్రగడ పద్మనాభరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కార్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి