
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిన వెంటనే రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్ గత 36 రోజుల పాటు జైల్లో ఉండి, తాజాగా తెలంగాణ హైకోర్టు నుండి బెయిల్ పొందారు. జానీ మాస్టర్ అక్టోబర్ 27న విడుదలయ్యారు.
ఈ కేసులో బాధితురాలు మొదటి సారిగా స్పందిస్తూ ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అన్యాయంపై ఆమె స్పందించారు, జానీ మాస్టర్ తనపై చాలా సంవత్సరాలపాటు మానసికంగా, శారీరకంగా టార్చర్ చేశాడని చెప్పింది. 20 ఏళ్ల తర్వాత కేసు పెట్టడంపై విమర్శలు వచ్చినా, ఆమె ధైర్యం పొందడంతో ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొంది. “నేను 4 సంవత్సరాల తర్వాత కేసు పెట్టాను, కానీ హేమా కమిటీ 20 ఏళ్ల తర్వాత పెట్టింది. నాకు ధైర్యం వచ్చినప్పుడు, సేఫ్గా ఫీలనప్పుడు పోరాడటంలో తప్పేముంది?” అని ఆమె ప్రశ్నించింది.
ఆమె చెప్పినట్లు, జానీ మాస్టర్లో మార్పు రాలేదు, అందువల్ల ఈ పెద్ద కేసు పెట్టాల్సి వచ్చిందని వివరించింది. ఆమె మాట్లాడుతూ, “ఇది రివేంజ్ కాదు. ఒక అమ్మాయికి గౌరవం అవసరం. నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిన తర్వాత దీన్ని రివేంజ్ అని ఎలా అంటారు?” అని అన్నారు
ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది, బాధితురాలు తన పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.