
ప్రతీ నిరుద్యోగి ఆసక్తిగా ఎదురు చూసిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకటన వాయిదా పడింది.కోటి ఆశలతో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. బుధవారానికి విడుదల కావాల్సిన మెగా డీఎస్సీ వాయిదా పడింది. ఇక ఇది ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో లక్షలాది నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోయాయి.
ప్రస్తుతం, బుధవారానికి విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే టెట్ ఫలితాలను ప్రకటించిన అధికారులు, రెండు రోజుల్లో 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆశలు రేకెత్తించారు. కానీ, అనుకోని పరిణామాల వల్ల ఈ ప్రకటన వాయిదా పడినట్లు తెలిసింది.
ప్రస్తుతం, మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ముఖ్య కారణం ఎస్సీ రిజర్వేషన్లను తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పూర్తయ్యే వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఆ సమయంలో, ఎస్సీ రిజర్వేషన్ల అమలు, ఈ సమస్యపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించబడ్డాయి.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 16,317 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎక్కువ ఖాళీలతో నిరుద్యోగులలో పెద్ద ఊహలు పెరిగాయి. ఈ పోస్టుల్లో, ఎస్జీటీ (6371), స్కూల్ అసిస్టెంట్లు (7725), టీజీటీ (1781), పీజీటీ (286), ప్రిన్సిపల్ (52), పీఈటీ (132) పోస్టులు ఉంటాయి.
కానీ, డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటంతో, నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోయాయి. ఎప్పటికి ఈ ప్రకటన జారీ అవుతుందో అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.