
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడి’ ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయపతాకం ఎగరవేసి, రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. కలియుగం ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను, మహాభారతంతో లింక్ చేస్తూ, నాగ్ అశ్విన్ రాసిన కథ అందరిని ఆకట్టుకుంది. “రేపటి కోసం” అనే భావనతో ఈ మూవీని రూపొందించిన విధానం ప్రశంసలు అందుకుంది.
‘కల్కి 2898 ఏడి 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో గర్భవతిగా ఉన్న దీపికా పదుకొణే పాత్ర, రెండో పార్ట్లో మరింత కీలకంగా ఉండనుందని సమాచారం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ను పంచుకున్నారు.
“ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రభాస్ నుంచి షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మరిన్ని పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రభాస్ లేని సీన్స్, కొన్ని సెట్టింగ్స్, ఇతర పనులు పూర్తి అయ్యాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ చిత్రాన్ని 2026 చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం” అని నాగ్ అశ్విన్ తెలిపారు.